తెలుగు సాహితీ వనం(Telugu Sahiti Vanam) ఆధ్వర్యంలో డాక్టర్ రాణీ పులోమజాదేవి కథా పురస్కారం(Dr Rani Pulomajadevi Story Award)-2026 కోసం కథలను ఆహ్వానిస్తున్నారు. దేవి జ్ఞాపకార్థం నగదు పురస్కారం ఇవ్వాలని ఆమె కుటుంబం సంకల్పించింది. రచయితలు(Writers) 2024, 2025 సంవత్సరాల్లో ప్రచురించిన కథా సంపుటాల రెండు కాపీలను కింది చిరునామాకు ఫిబ్రవరి 10వ తేదీ లోపు పంపాలి. విజేత(Winner)కు జూలైలో హైదరాబాద్లో జరిగే తెలుగు సాహితీ వనం వార్షికోత్సవం(Anniversary)లో రూ.5 వేల నగదుతో పురస్కార(Cash Prize) ప్రదానం ఉంటుంది. విజేతలు తప్పనిసరిగా సభకు వచ్చి పురస్కారం అందుకోవాలి. అవార్డ్ నిమిత్తం పరిశీలనకు పంపిన పుస్తకాలను తిప్పి పంపడం కుదరదని తెలుగు సాహితీ వనం నిర్వాహకులు శాంతికృష్ణ & టీం తెలిపారు.
చిరునామా
డాక్టర్ తిక్కా సత్యమూర్తి
ప్లాట్ నం-డి42, ఫ్లాట్ నం-504
సాయిలక్ష్మీ ఎన్క్లేవ్, మధురా నగర్
హైదరాబాద్-500038
మొబైల్ 9849344109
