కరీంనగర్ స్థానిక రేకుర్తి విజన్ హై స్కూల్ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా అగ్నిమాపక కేంద్రం, జిల్లా గ్రంంధాలయాన్ని, సందర్శించారు. తొలుత అగ్నిమాపక కేంద్రం సందర్శించగా అగ్నిమాపక సిబ్బంది మరియు అధికారులు అగ్ని వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ఫైర్ ఆక్సిడెంట్ అయినప్పుడు తీసుకునే మెలకువలను విద్యార్థులకు తెలియచేశారు. విద్యార్థులు ఫైర్ స్టేషన్ లోని. అగ్నిమాపక వాహనాలను తిలకించారు స్టేషన్ అంతట తిరుగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలోని లైబ్రరీని కూడా సందర్శించి లైబ్రరీలో అందుబాటులో ఉన్న వివిధ పుస్తక బండాగారాన్ని పరిశీలించి లైబ్రరీలో ఏ విధంగా చదువుకోవాలో తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విజన్ హై స్కూల్ కరస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటుగా సమాజంలోని వివిధ వ్యవస్థల పట్ల అవగాహన అవసరమైన మెలకువలను బోధించే క్రమంలో క్షేత్ర పర్యట చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజన్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
