గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Grain Purchasing Centers) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy), జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ (District Collector B.M. Santosh) హాజరయ్యారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కర్షకులు యూరియా (Urea) వాడి పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అన్నదాతలు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ చెప్పారు.
- Advertisement -
