Bhadradri Kothagudem: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసే హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జీతిష్ వి పాటల్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అదనపు డీఆర్డీఓ రవికుమార్ (ఫోన్ నంబర్ 85018 50264), స్కూల్ అసిస్టెంట్ సాయికృష్ణ (ఫోన్ నంబర్ 93966 54181)లను జిల్లా లైజనింగ్ అధికారులుగా కలెక్టర్ నియమించారు.