Homeనిజామాబాద్‌Yellareddy DSP | ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం..

Yellareddy DSP | ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం..

  • ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు.
  • నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పనితీరు బేష్..
  • యువత డ్రగ్, గుట్కా,మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి.
  • యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న యువతకు ఉచితంగా శిక్ష ఇప్పిస్తాం.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రతి గ్రామాల్లో నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు.ఆయన సోమవారం తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలు ఉన్నచోట నేరాలు నియంత్రణలో ఉన్నాయని, అలాగే నేరం చేసిన వ్యక్తిని కూడా వెంటనే పట్టుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

గతంలో రాబరీలు జరిగేవని, బంగారం డబ్బు, దొంగలించే వారిని ఇప్పుడు కాలం మారింది అన్ని ఫోన్లో సైబర్ క్రైమ్ లో జరుగుతున్నాయన్నారు.ఫోన్లో అపరిచిత వ్యక్తులు పంపే లింకులను తెరవద్దని సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఓటీపీలు అపరిచితులకు చెప్పవద్దన్నారు. ఇప్పుడు అంతా సైబర్ నేరాలే జరుగుతున్నందున సైబర్ క్రైమ్ లపై ప్రజల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల్లో యువత మత్తు,డ్రగ్స్,కు అలవాటు కావద్దని వారి విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

- Advertisement -

యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే యువతకు తాము ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని ఒక ఇంటిలో ఒక్కరు ఉద్యోగం సాధించిన ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా నిలుదొక్కుకుంటుందని అన్నారు. ప్రతి గ్రామానికి పోలీస్ శాఖ నుండి ఒక (వీపిఓ) విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడని ఏదైనా సమస్య ఉంటే అతని దృష్టికి తీసుకువస్తే సమస్య గ్రామస్థాయిలో పరిష్కారానికి అతను కృషి చేస్తాడు అన్నారు.

సీసీ కెమెరాల్లో ప్రస్తుతం కోతల బెడద వల్ల వైర్లు తెగి అంతరాయం ఏర్పడుతుందని వైర్లెస్ సీసీ కెమెరాలు, సోలార్ సిసి కెమెరాలు, ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో డిఎస్పీకి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఎస్సై నరేష్, చిట్యాల గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి, చిట్యాల గ్రామ విపిఓ యాదగిరి, ప్రముఖ వ్యాఖ్యాత అంబిర్ మనోహర్రావు, గ్రామ పెద్దలు డ్వాక్రా సంఘాల మహిళలు గ్రామ యువకులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News