Tuesday, October 28, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుACB | విద్యుత్ అధికారి ఇంట్లో నోట్ల కట్టల గుట్ట..

ACB | విద్యుత్ అధికారి ఇంట్లో నోట్ల కట్టల గుట్ట..

  • ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
  • సోదాల్లో రూ.2 కోట్ల నగదు పట్టివేత..
  • దాదాపు రూ.200 కోట్ల పైగా ఆస్తుల గుర్తింపు
  • ఆయన బినామీలు, బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు..

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్లోని మణికొండలో విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ ఆస్తులు భారీగా బయటపడ్డాయి. ఏసీబీ బృందాలు ఒకేసారి 18 చోట్ల సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించి ఇంకా అంబేద్కర్, ఆయన బినామీలు, బంధువులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రతి పనికి లంచం తీసుకునే అలవాటు అంబేద్కర్కు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. గచ్చిబౌలిలో ఉన్న అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ. 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గచ్చిబౌలిలో ఒక ఖరీద్కెన భవనాన్ని కూడా గుర్తించారు. అంతేకాకుండా, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో అంబేద్కర్కు 10 ఎకరాల వ్యవసాయ భూమి, వెయ్యి గజాల్లో ఫామ్ హౌస్ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో లభించిన వ్యవసాయ భూముల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు భాగం పంచుకున్నారనే దానిపై విచారణ కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News