- కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నది. ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి లేకుండా తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారంయాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సతీమణి కమల పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడిరచారు. స్వామి వారి ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని, కేసీఆర్ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికలకు వెళ్లేందుకే తాము సిద్ధంగా ఉన్నామని, జమిలి ఎన్నికలు స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ కమిటీ జమిలి పై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు.
తప్పక చదవండి
-Advertisement-