దేశ మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమాన హక్కులు కల్పించే చారిత్రాత్మక నిర్ణయమని స్థానిక మహిళా నాయకులు పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు విస్తరించే ఈ బిల్లును వ్యతిరేకించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల హక్కుల విషయంలో పెద్ద పెద్ద ప్రకటనలు చేసే కాంగ్రెస్ కూటమి ఈ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. మహిళల అభివృద్ధిని అడ్డుకునే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనగా బాలాజీనగర్ చౌరస్తాలో మహిళలు, నాయకులు కలిసి రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుని మహిళల పక్షాన నిలవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.
