మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని నందులపల్లిలో గల శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లును ఈరోజు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు. ప్రజావాణిలో భాగంగా నెన్నెల గ్రామస్తులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్, నందులపల్లి మిల్లులో 4.79 కోట్ల అవినీతి జరిగిందని అవినీతిపరులపై కేసు నమోదు చేసి రికవరీ చేయాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా నేడు శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లు తనిఖీ చేసి రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పిస్తామని పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు.

- Advertisement -
