- నిలిచిపోయిన బస్సులు
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. బుధవారం మొదటి షిఫ్ట్ నుంచే బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజారవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్మల్ లో 156, బైంసాలో 75 ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా స్పందన రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు.


- Advertisement -
