- ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజులుగా చేస్తున్న కార్మికులకు మంచిర్యాల డిపోలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. మద్దుతు తెలిపి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆర్టీసీ కార్మికులకు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తూ కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీ లు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, కర్రె లచ్చన్న, మెరెడికొండ శ్రీనివాస్, అశోక్, పవన్, మణికాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

