- ముగ్గురు నిందితుల అరెస్ట్, 22.22 కిలోల ఎండు గంజా*యి స్వాధీనం
హైదరాబాద్ నగర కమిషనర్ టాస్క్ ఫోర్స్ (చార్మినార్ జోన్) బృందం మరియు బాలాపూర్ పోలీసు స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజా*యి విక్రేతల ముఠాను పట్టుకున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్నగర్, సాదత్ నగర్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 22.22 కిలోల ఎండు గంజా*యి, 4 మొబైల్ ఫోన్లు మరియు ప్రయాణ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 12,00,000/- ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నిందితుల వివరాలు:
1.మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాం (వయస్సు: 35 సంవత్సరాలు),తండ్రి పేరు: దివంగత మీర్జా యూసుఫ్ బైక్,వృత్తి: ఆటో డ్రైవర్,నివాసం: అమీనా మసీదు సమీపంలో, షాహీన్నగర్, హైదరాబాద్,నేర చరిత్ర: బాలాపూర్ పోలీస్ స్టేషన్ రౌడీషీటర్
2.అవాద్ బిన్ అలీ యాఫై అలియాస్ అవాద్ (వయస్సు: 22 సంవత్సరాలు),తండ్రి పేరు: అలీ బిన్ అబిద్ యాఫై,వృత్తి: వాల్ పెయింటర్,నివాసం: కొత్తపేట, బార్కస్, హైదరాబాద్
3.సర్దార్ మన్ ప్రీత్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ధిల్లాన్ (వయస్సు: 22 సంవత్సరాలు),తండ్రి పేరు: హర్జీత్ సింగ్ థిల్లాన్,వృత్తి: వెల్డర్,నివాసం: సిక్కు ఛావణి, కిషన్బాగ్, హైదరాబాద్
స్వాధీనం చేసుకున్న సొత్తు:
- ఎండు గంజా*యి: 22.22 కిలోలు
- మొబైల్ ఫోన్లు: 04
- ట్రాలీ బ్యాగులు: 02
- బ్యాక్ప్యాక్ బ్యాగ్: 01
కేసు పూర్వాపరాలు / వివరాలు:
విచారణలో నిందితులు ముగ్గురూ పాత నేరస్థులని తేలింది. వీరిలో ప్రధాన నిందితుడైన మీర్జా జాఫర్ బైగ్ అలియాస్ సద్దాం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్గా ఉన్నాడు. ఇతనిపై గతంలో హత్యలు, హత్యాయత్నాలతో సహా 22 కేసులు ఉన్నాయి. అలాగే అవాద్ బిన్ అలీ యాఫై పై గతంలో 10 దొంగతనం కేసులు, సర్దార్ మన్ ప్రీత్ సింగ్ ధిల్లాన్ పై 2 హత్యాయత్నం కేసులు నమోదు కాబడ్డాయి.
బాలాపూర్ కొత్తపేటకు చెందిన మరొక పాత నేరస్థుడైన ఇబ్రహీం బామర్తో వీరి పరిచయం ఏర్పడింది. వీరందరూ కలిసి ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ నుండి తక్కువ ధరకు గంజా*యిని కొనుగోలు చేసి, హైదరాబాద్లోని వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించి లాభపడాలని ప్లాన్ చేశారు.
ఈ పథకం ప్రకారం, 17-07-2026న నిందితులు ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్కు వెళ్లారు. అక్కడ జన్నీ అలియాస్ సన్నీ అనే వ్యక్తి వద్ద నుండి కిలో రూ. 5,000/- చొప్పున 22 కిలోల ఎండు గంజా*యిని కొనుగోలు చేసి, మూడు బ్యాగులలో భద్రపరిచారు. అనంతరం రైలులో ఖమ్మం వరకు చేరుకున్నారు.
20-07-2026న మధ్యాహ్నం, ప్రధాన నిందితుడు ఇబ్రహీం బామర్ సూచనల మేరకు పోలీసులు దొరకకుండా ఉండేందుకు మీర్జా జాఫర్ బైగ్, అవాద్, మన్ప్రీత్ సింగ్ ఖమ్మంలో రైలు దిగి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. ఇబ్రహీం బామర్ మాత్రం నేరుగా రైలులోనే హైదరాబాద్ చేరుకున్నాడు.
హైదరాబాద్కు గంజా*యి చేరిన తర్వాత, ఇబ్రహీం బామర్ సదరు గంజా*యిని కొనుగోలుదారునికి అందజేయాలని ఆదేశించాడు. 21-07-2026 సాయంత్రం, నిందితులు ముగ్గురూ సాదత్ నగర్ బస్ స్టాప్ వద్ద గంజా*యి బ్యాగులతో కొనుగోలుదారుని కోసం వేచి చూస్తుండగా, పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ మరియు బాలాపూర్ పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం బిన్ సలీమ్ బామర్ అలియాస్ ఇబ్రహీం బామర్ మరియు గంజా*యి సరఫరాదారుడు జన్నీ అలియాస్ సన్నీ (ఒడిశా) ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
