భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ఇల్లందు మండలం (Yellandu Mandal) డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) యాకూబ్ పాషా అవినీతి నిరోధక శాఖ (Acb) అధికారులకు చిక్కారు. రేషన్ షాపు (Ration Shop) యజమాని నుంచి రూ.30 వేలు లంచం (Bribe) డిమాండ్ చేసి దొరికిపోయాడు. డీలర్ల సంఘం అధ్యక్షుడి ద్వారా లంచం తీసుకుంటూ యాకూబ్ పాషా, గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రేషన్ షాపులో స్టాక్ లేనందుకు, పని వేళ్లలో రేషన్ షాపును మూసివేసినందుకు చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు అడగటంతో ఏసీబీ రంగ ప్రవేశం చేసి దొరకబుచ్చుకుంది.
- Advertisement -
