- చేయించిన మున్సిపల్ ఛైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా 7వ వార్డ్ లో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు ఆధ్వర్యంలో దోమల మందు పిచికారీ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో దోమలను నివారించడం కొరకు 34 వార్డ్ లలో రోజుకొక వార్డ్ చొప్పున 34 రోజుల పాటు దోమల మందు పిచికారి చేయబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాలి శ్రీనివాస్ బస్తీ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
