Friday, June 5, 2026
Homeతెలంగాణదత్తాత్రేయను కలిసిన గౌడ ఐక్య సాధన సమితి నాయకులు..

దత్తాత్రేయను కలిసిన గౌడ ఐక్య సాధన సమితి నాయకులు..

  • సమాజ అభివృద్ధి, గౌడ వర్గ సమస్యలపై చర్చ..
  • కార్యక్రమంలో పాల్గొన్న అంబాల నారాయణ గౌడ్, పొన్నం నారాయణ గౌడ్..

గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణ గౌడ్ శుక్రవారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమాజ అభివృద్ధి, గౌడ వర్గం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు,సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు చర్చించినట్లు సమాచారం.

సమాజ ఐక్యత, యువత అభ్యున్నతి కోసం గౌడ ఐక్య సాధన సమితి చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు దత్తాత్రేయకు వివరించారు. సమాజ సేవలో మరింత చురుకుగా ముందుకు సాగాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దత్తాత్రేయ సూచించినట్లు తెలిపారు.

- Advertisement -

ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగగా, సమాజ అభివృద్ధికి పరస్పర సహకారంతో పనిచేయాలనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News