Saturday, May 2, 2026
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila | కేంద్రంపై విరుచుకుపడ్డ వై.ఎస్.షర్మిల..

YS Sharmila | కేంద్రంపై విరుచుకుపడ్డ వై.ఎస్.షర్మిల..

  • ఓట్ల కోసం వేషాలు కట్టడం అలవాటైంది..
  • ప్రజలపై బండబాదుడు ఇదే మోడీ నైజం..

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం వేషాలు కట్టి, ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై ‘బండ బాదుడు’ మోపడం మోదీకి అలవాటుగా మారిందని ఆమె ఘాటుగా విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఈ ధరల పెంపేనని షర్మిల ఎద్దేవా చేశారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ. 993, 5 కిలోల సిలిండర్‌పై రూ. 549 పెంచిన ఘనత మోదీకే దక్కుతుందని ఆమె అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే రూ. 1,513 పెంచడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని, ఈ ఏడాదిలోనే ధర 80 శాతం పెరిగిందని ఆరోపించారు. ఈ అద్భుత ఘనకార్యానికి గుర్తుగా దేశంలోని మ్యూజియంలలో మోదీ పేరును సువర్ణాక్షరాలతో రాయించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఈ ధరల పెంపు సామాన్యులకు వాతలు పెట్టడమేనని, బయట తినేవారిపై పెనుభారంగా మారుతుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. టీ స్టాల్స్, చిన్న హోటళ్లు నడుపుకునే వ్యాపారుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చారని, విద్యార్థులు, వలస కార్మికుల నడ్డి విరిచారని విమర్శించారు. చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు లాభాలు ఆర్జించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ధరలు పెరిగాయని ప్రజలపై భారం వేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. పెంచిన ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News