- మాజీ కౌన్సిలర్ తుడుం గణేశ్
పూడూరు కిష్టాపూర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని బుధవారం డెప్యూటీ కమిషనర్ సుధాంష్ ను తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన మాజీ కౌన్సిలర్ తుడుం గణేశ్, ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ కిష్టాపూర్ పరిధిలో వీకర్ సెక్షన్ కాలనిలో అండర్ డ్రైనేజీ వేసి రోడ్లు దువ్వడం మరిచారు అని తెలిపారు,దానివల్ల అటుగా వెళ్లే వాహన దారులకు, వృద్ధులకు చిన్న పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు
అంతే కాకుండా ఐమాక్స్ లైట్లు సీట్ లైట్లు కొన్ని రోడ్లు గుంతలుగా మారి చాలా ప్రమాదంగా ఉన్నాయి అని కమిషనర్ కి వివరించమని తెలిపారు, ప్రస్తుతం కిష్టాపూర్ ప్రధాన రహదారులపై డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తుడుము గణేష్ ,బి ఆర్ ఎస్ నాయకులు పవన్ కుమార్ పాల్గొన్నారు.
