- విద్యుత్ అధికారులు
మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల్ రాజేందర్ ను తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహ జ్యోతి పథకం ప్రకటించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రతీ వినియోగదారుడికి శు భాకాంక్షలు తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రారంభించనున్న కార్యక్రమంలో భాగంగా ఎంపీని కలిశామని తెలిపారు. ఈ నూతన కార్యక్రమాన్ని కేపీ లాంఛనంగా ప్రారంభించారు.ఎస్ ఈ కరుణాకర్, డి ఈ జాన్ పోతురాజు, ఏ డి ఈ రాజా మల్లేశం, ఏ ఈ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
