హనుమకొండ జిల్లా(Hanumakonda District)లోని ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి(Inavolu Sri Mallikarjuna Swamy) వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ఆహ్వానించారు. అసెంబ్లీ ఛాంబర్లో మంత్రులు(Ministers) కొండా సురేఖ(Konda Surekha), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)తోపాటు ఆలయ పూజారులతో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎంకి ఆశీర్వచనం అందించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే (Vardhannapet MLA) కేఆర్ నాగరాజు(KR Nagaraju) తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి.
- Advertisement -
