గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి 44 అనుకోని ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్ నిర్మాణం చేస్తున్నారు. అక్రమాలను మొదటిలోనే అడ్డుకోవాల్సిన అధికారులు ఇలాంటి నిర్మాణాల వైపు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సూదంష్ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- Advertisement -
