- ఎమ్మెల్యే మేఘారెడ్డి..
2026 వ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అనుకున్నది సాధిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి వారిని గురువారం దర్శించుకున్నారు. గత సంవత్సర తీపి జ్ఞాపకాలను, చేదు అనుభవాలను, కొత్త పరిచయాలను క్రూఢీకరించుకుని ప్రతి ఒక్కరు నూతనోత్సాహంతో ముందుకు సాగాలన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో .. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
