నిజామాబాద్ (Nizamabad) పద్మశాలి (Padmashali) వసతిగృహ ఎన్నికల (Hostel Elections) విజేతలను (Winners) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) గాంధీ భవన్(Gandhi Bhavan)లో అభినందించారు. వసతిగృహ ఎన్నికల్లో గెలుపొందిన గికొండ యాదగిరి బృందానికి హార్దిక శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. హాస్టళ్లు అంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గృహాలని పేర్కొన్నారు. విద్యార్థులకు సేవ చేయాలనే తపనతో ముందుకొచ్చిన యాదగిరి బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు తగిన వసతులు, సదుపాయాలు కల్పించడంలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
- Advertisement -
