సికింద్రాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubileehills By Election)లో రౌడీషీటర్ (Rowdy Sheeter) నవీన్ యాదవ్(Naveen Yadav)కు టికెట్ ఇచ్చారంటూ బీసీలను అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ (OU Arts College) వద్ద ఆయన చిత్రపటాలను చింపారు. కేసీఆర్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కేసీఆర్ ఫొటోలను దగ్ధం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. బీసీలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చి పదేళ్లు సీఎం (CM) పదవి అనుభవించి ఈ రోజు బీసీ వ్యక్తి బరిలో ఉంటే అతణ్ని రౌడీ షీటర్ అనటం సరికాదని లింగం గౌడ్ విమర్శించారు.
