Friday, October 10, 2025
ePaper
Homeఅంతర్జాతీయంJamieson Greer | రష్యాతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి: ట్రంప్‌ సలహాదారు జెమీసన్‌ గ్రీర్‌

Jamieson Greer | రష్యాతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి: ట్రంప్‌ సలహాదారు జెమీసన్‌ గ్రీర్‌

అమెరికా అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్‌కి సొంత వర్గం నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆయన చర్యలను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో యాదార్థాలను ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు. ఇందుకు తాజాగా అమెరికా వాణిజ్య ప్రతినిధి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జెమీసన్ గ్రీర్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

న్యూయార్క్ లో జరిగిన ది ఎకనామిక్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ..రష్యా నుంచి కొనుగోలు చేసే చమురే భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాదని అన్నారు. అయినా ఇప్పటికే భారత్ తన చమురు కొనుగోళ్లను మాస్కో నుంచి మళ్లిస్తోందని తెలిపారు.

భారత్‌ సార్వభౌమత్వ దేశమని ట్రంప్‌ సలహాదారు జెమీసన్‌ గ్రీర్‌ అన్నారు. ఆ దేశం సొంత నిర్ణయాలు తీసుకోగలదని తెలిపారు. ఇతర దేశాలు ఎవరితో సంబంధాలు కొనసాగించాలి.. ఎవరితో కొనసాగించ కూడదు అనేది మేం చెప్పాలనుకోవడం లేదు. ఈ విషయంలో మేం ఎవర్నీ శాసించడం లేదు అని గ్రీర్‌ తెలిపారు.

రష్యాతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ, గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మాస్కో నుంచి చమురును కొనుగోలు చేయలేదు. డిస్కౌంట్‌ ధరల కారణంగా గత రెండు, మూడేళ్ల నుంచి రష్యా చమురును ఎక్కువగా కొంటోంది.

ఇది కేవలం వినియోగం కోసం మాత్రమే కాదు.. ఆ చమురును శుద్ధి చేసి రీసేల్‌ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థకు రష్యా చమురు కొనుగోళ్లు ఒక్కటే బలమైన ఆధారం కాదని అర్థమవుతోంది. అందుకే వారు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాలని సూచిస్తున్నాం. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

అయితే, రష్యా చమురును కొనుగోలు చేయడంతో ఉక్రెయిన్‌పై యుద్దానికి పుతిన్‌కు న్యూదిల్లీ వనరులను అందించినట్లవుతోంది. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై ఈ స్థాయిలో సుంకాలు విధించాల్సి వచ్చింది. అయితే, టారిఫ్‌ల విషయంలో అమెరికాతో ఆ దేశం గొప్ప డీల్‌ చేసుకుంటోందని గ్రీర్‌ వెల్లడించారు. దీనిని బట్టి మెల్లగా వాస్తవాలను ట్రంప్‌ బృందం గుర్తిస్తోందని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News