భారత ఓపెనింగ్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో వీర విహారం చేశాడు. పాక్తో జరిగిన మ్యాచులో అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో తొలి బంతికే సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికి రెండు మ్యాచ్లలో సిక్స్లు బాదిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అభిషేక్ నిన్నటి మ్యాచులో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ భారత బ్యాట్స్మన్ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో పాకిస్తాన్ మీద అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా ఘనత సాధించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్కుగానూ అభిషేక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తన గురువు యువరాజ్ రికార్డును కూడా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎల్లప్పుడూ హై-వోల్టేజ్ పోరు తప్పదు. ఈ మ్యాచ్లో ఆటగాళ్లు భారీ పరుగుల కోసం ప్రయత్నిస్తారు. అదే సమయంలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో అత్యంత వేగంగా అర్ధ శతకాలు బాదిన ఆటగాళ్లలో 2 దేశాల బ్యాటర్లు ఉన్నారు. ఈ జాబితాలో మహ్మద్ హఫీజ్ నెంబర్ వన్ గా ఉన్నాడు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లో అత్యంత వేగంగా అర్ధ శతకం సాధించిన రికార్డు పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ హఫీజ్ పేరిట ఉంది. హఫీజ్ 2012లో అహ్మదాబాద్ వేదికగా 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అభిషేక్ పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో దాదాపు 190 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేశాడు. అభిషేక్ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.భారత ఆల్ రౌండర్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.