- బిజేపి జాతీయ కౌశాధికారి టీం సాయి
మల్కాజిగిరి : బిజేపి జాతీయ కౌశాధికారి టీం సాయి బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా టీం సాయి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును రాబోయే ఎలక్షన్స్ లో ఓడించి మల్కాజ్గిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.మైనంపల్లి హనుమంతరావు పేదల భూములను కబ్జా చేశారని,బాధితులతో త్వరలోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానని అన్నారు.