Friday, April 24, 2026
Homeహైదరాబాద్‌Rajapushpa | టీజీఐఐసీ వేలంలో 10.09 భూమిని దక్కించుకున్న రాజపుష్ప

Rajapushpa | టీజీఐఐసీ వేలంలో 10.09 భూమిని దక్కించుకున్న రాజపుష్ప

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప, ఉస్మాన్ నగర్‌లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన భూ వేలంలో 10.09 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 1ను విజయవంతంగా దక్కించుకుంది. ఈ వేలంలో ప్లాట్ నంబర్ 1, 6తో పాటు పలు భూములను అమ్మకానికి ఉంచగా, ప్లాట్ 1ను రాజపుష్ప దక్కించుకుంది. ఈ స్థలం కంపెనీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ’కి ఆనుకునే ఉంది. 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పక్కనే కొత్త స్థలాన్ని సొంతం చేసుకోవడం ద్వారా, ఈ ప్రాంతంలో తన అభివృద్ధి ప్రణాళికలను రాజపుష్ప మరింత బలోపేతం చేసింది.

తాజా పరిణామంపై రాజపుష్ప రెసిడెన్షియల్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆ సంస్థ డైరెక్టర్ భరత్ రాజ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ భూమి మా 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న టౌన్‌షిప్‌కు ఒక ముఖ్యమైన ముఖద్వారంగా నిలుస్తుంది. మేము ఇక్కడ ఒక ప్రీమియం రిటైల్ మాల్ మరియు గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీతో కూడిన మిక్స్‌డ్-యూజ్ డెవలప్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నాము. ఇది రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ యొక్క మొత్తం ఎకోసిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తుంది.” అని పేర్కొన్నారు. ఈ స్థలం మొత్తం విలువ సుమారు 517 కోట్లు కాగా, అంటే ఎకరానికి దాదాపు రూ.51.25 కోట్లు వెచ్చించారు. హైదరాబాద్‌లో భారీ స్థాయి ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టైల్ గమ్యస్థానాలను నిర్మించాలనే రాజపుష్ప నిబద్ధతలో ఈ కొనుగోలు మరో కీలక అడుగు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News