- చెత్తను తీసుకువెళ్లి మున్సిపల్ ఆఫీసులో వేసిన ప్రజలు..
మహబూబాబాద్ మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 21వ వార్డులో గత వారం రోజులుగా చెత్తను శుభ్రం చేయకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు తమ ఇంటి చెత్తను తామే ఊడ్చి బకెట్లలో చేత పట్టుకొని మున్సిపల్ కార్యాలయంలోని ప్రతీ సెక్షన్ రూములో వేసి నిరసన తెలిపారు. దీంతో హుటా హుటిన మున్సిపల్ సిబ్బంది కార్యాలయంలోని చెత్తను తొలగించింది. మున్సిపాలిటీ మొత్తం చెత్తా, చెదారంతో అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -
