నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన కాశ మౌని పరశురాముల చారి ఆకస్మిక మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించి, మృతుని కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం(Financial Support) అందించారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, సర్పంచ్ జల్లెల్ల పద్మ కృష్ణ యాదవ్, ఉప సర్పంచ్ మున్య నాయక్, బైరాపురం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.అలాగే వార్డ్ మెంబర్లు యముకంటి వెంకటేష్, శెట్టిపల్లి లోకేష్, నీరటి శేఖర్, పాలారీ పర్వతాలు, ఆరకంటి, ఎముకంటి శ్రీశైలం, జల్లెళ్ల మొగులాల్, బొడ్డుపల్లి సురేష్, గ్రామ పెద్దలు, స్థానికులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Financial Support | ఎల్లికల్లో మృతుని కుటుంబానికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆర్థిక సహాయం
By Aadab Desk
- Advertisement -
