హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల(Ramoji Excellence Awards) ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. రామోజీ రావు జయంతి (Jayanthi) సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులను ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించడం శుభపరిణామమని అన్నారు. రామోజీరావు పాటించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్ను అభినందించారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు–ఈటీవీ (Eenadu-Etv) ప్రజల జీవితాల్లో భాగమైందని, రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు, హైదరాబాద్ (Hyderabad) నగరానికి గర్వకారణంగా నిలుస్తోందని సీఎం అన్నారు.
- Advertisement -
