- పాల్గొన్న చైర్ పర్సన్ దావా స్వాతి, కమిషనర్ సంపత్..
బెల్లంపల్లి శాసనసభ్యులు, గడ్డం వినోద్ గారి* ఆదేశాల మేరకు, బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో టూ టౌన్ ఎస్ఐ శ్రీ. కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ‘అరైవ్_అలైవ్’ -2026 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహనా సదస్సులో పాల్గొన్న బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు .. మున్సిపల్ కమిషనర్ *సంపత్
ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అదేవిదంగా కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించాలన్నారు.. ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు పోలీసులు చేస్తున్న కృషిని ఈ సందర్బంగా ప్రశంసించారు.. కార్యక్రమంలో మున్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
