జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం(Korutla Mandal) రామారావుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలువేరి మహేష్కు చెందిన గొర్రెల మందపై పిడుగు పడటంతో(Lightning Strike) సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. ఈ ఘటనతో గొర్రెల యజమాని మహేష్ తీవ్రంగా నష్టపోయాడు. ప్రభుత్వం స్పందించి పిడుగు పాటుతో మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
