ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది.. నెల్లూరు జిల్లాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.. లంచం తీసుకుంటూ ఏసీబీ అడ్డంగా చిక్కాడు ఏ.ఎస్.పేట తహసీల్దార్ శాంతిస్వరూప్..అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక రైతు కృష్ణారెడ్డి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.. కాగా పాస్ పుస్తకంలో పేరు మార్చేందుకు తహసీల్దార్ శాంతిస్వరూప్ రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు.. తహశీల్దార్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు..
- Advertisement -
