Tuesday, June 2, 2026
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు..

Pawan Kalyan | తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు..

  • వారి త్యాగాలు మరువలేనివి..
  • అమరవీరులకు నివాళులు : పవన్ కళ్యాణ్..

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. స్వరాష్ట్ర సాధన వెనుక ఉన్న సుదీర్ఘ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నారు. తెలంగాణను “సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం” అని అభివర్ణించిన పవన్, ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రాసిన “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే ఐకానిక్ పంక్తులను గుర్తుచేశారు.

దశాబ్దాల ప్రజల ఆకాంక్షలు, ఆత్మగౌరవ ఉద్యమం, అపారమైన త్యాగాల వల్ల సాకారమైన తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంటూ… ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆయన వినమ్రంగా నివాళులర్పించారు. తెలంగాణకు ఉన్న పోరాటాల వారసత్వాన్ని ప్రస్తావిస్తూ… సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుండి కొమురం భీమ్ వీరత్వం వరకు ఈ నేల ఎల్లప్పుడూ న్యాయం కోసం పోరాడిందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

- Advertisement -

ఇక్కడి గాలిలో ధైర్యం, నీటిలో ఉద్యమ స్ఫూర్తి, మట్టిలో అమరుల రక్తం కలిసి ఉన్నాయని భావోద్వేగంగా పేర్కొన్నారు. తెలంగాణతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకుంటూ… ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల సమస్యలు, గిరిజన హక్కులు, రైతుల కష్టాలు, యువత నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి అంశాలను తాను ఎప్పుడూ కేవలం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలోనే చూశానని స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్‌లు, విద్యా రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని ఆయన అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News