- చంచల్ గూడ లో ఘటన..
- వెదుకుతున్న పోలీసులు..
దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దొంగ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలులో ఉంచారు. రిమాండ్లో ఉన్న ఖైదీ నరేష్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు పీటీ వారెంట్పై బోయిన్పల్లి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి అక్కడి నుంచి జైలుకు తరలిస్తుండగా చంచలగూడ జైలు సమీపంలో వాహనం నుంచి దూకి నరేష్ పారిపోయాడు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు మ్మురంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.
- Advertisement -
