Wednesday, April 22, 2026
Homeనల్లగొండRTC Strike | ప్రభుత్వంతో చర్చలు విఫలం…

RTC Strike | ప్రభుత్వంతో చర్చలు విఫలం…

  • జనగామలో ఆర్టీసీ సమ్మె ఉధృతం

జనగామ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతమైంది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో మొత్తం 122 బస్సులు నిలిచిపోవడంతో రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో కార్మికులు బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను మరింత విస్తరించేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఇకపోతే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే చర్చలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయన్నదిపై స్పష్టత లేకపోవడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News