Tuesday, April 21, 2026
Homeనల్లగొండInauguration | ఈవీ బైక్ షోరూమ్ ప్రారంభం

Inauguration | ఈవీ బైక్ షోరూమ్ ప్రారంభం

  • కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పర్యావరణ హిత రవాణా వైపు అడుగులు వేస్తూ స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ షోరూమ్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించిన ఆయన, అనంతరం ప్రదర్శనలో ఉన్న ఈవీ వాహనాలను పరిశీలించి వాటి సాంకేతికత, పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని పేర్కొన్నారు.

పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యల నేపథ్యంలో ప్రజలు ఈవీ వాహనాలవైపు మొగ్గుచూపడం అవసరమని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన వాహనాలు అందించడంతో పాటు అమ్మకాల అనంతర సేవలను మెరుగ్గా అందించాలని షోరూమ్ యాజమాన్యానికి సూచించారు. స్థానికంగా ఈవీ వాహనాల లభ్యత పెరగడం వల్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News