బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు.
మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.2400, వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ. 2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ఉంటుందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలో పంటలు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇర్ల చిన్నయ్య, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -
