శ్రీరామనవమి పురస్కరించుకొని హిందూ వాహిని, బజరంగ్ళ్ ఆధ్వర్యంలో దేవరకోట ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరై జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -
