వేసవి కాలాన్ని పురస్కరించుకుని నిర్మల్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా జడ్జి శ్రీవాణి బుధవారం ప్రారంభించారు. కోర్టుకు వచ్చే కక్షిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
