Wednesday, February 18, 2026
HomeజాతీయంOm Birla | రెహమాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఓం బిర్లా..

Om Birla | రెహమాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఓం బిర్లా..

  • ప్రధాని మోడీ నుండి వ్యక్తిగత అభినందన లేఖ అందజేత..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం కొత్తగా ఎన్నికైన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్‌ను కలిసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి వ్యక్తిగత అభినందన లేఖను అందజేశారు . భారత ప్రభుత్వం తరపున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఓం బిర్లా రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. లోక్‌సభ స్పీకర్ మాల్దీవుల అధ్యక్షుడు, భూటాన్ ప్రధాన మంత్రి సహా ఇతర దేశాల ముఖ్య నాయకులతో కూడా సమావేశమయ్యారు.

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తో ఫలవంతమైన సమావేశం జరిగిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఆయనకు ప్రధాని మోదీ నుండి ఒక వ్యక్తిగత లేఖను అందజేశాను, అందులో ప్రధాని మోదీ వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించాలని తారిఖ్ రెహమాన్ ను ఆహ్వానించారని లోక్ సభ స్పీకర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

- Advertisement -

తారిక్ రెహమాన్‌తో తన సమావేశం గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, “భారత ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇరుగు పొరుగు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిబద్ధతను పునరుద్ఘాటించాను” అని అన్నారు. భారతదేశంలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా మాట్లాడుతూ…

“ఓం బిర్లా భారతదేశ శుభాకాంక్షలు తెలియజేసి, దేశాన్ని సందర్శించమని ఆహ్వానించారు. బంగ్లాదేశ్ – భారతదేశ ప్రజల సంక్షేమం కోసం ప్రజా-కేంద్రీకృత సహకార విధానాలపై కలిసి పనిచేయాలని ఇరువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News