వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పోకల రమాదేవి ఈనెల 3 నుండి 5 వరకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని సింగానియా యూనివర్సిటీలో జరిగిన పారా త్రో బాల్ నేషనల్ ఫెడరేషన్ కప్-2026 లో కాంశ్య పథకం సాధించారు. చిన్నతనంలోనే మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ, క్రీడల పట్ల మక్కువ పెంచుకొని జాతీయస్థాయిలో వివిధ పథకాలను సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
