మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే(Balkonda Mla) వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula PrashanthReddy) పేదల చికిత్స కోసం రూ.3 లక్షల విలువైన రెండు LOCలను బాధితులకు శనివారం అందజేశారు(LOCs Handover). వివిధ అనారోగ్య సమస్యల వల్ల హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితుల కుటుంబ సభ్యులకు ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో సంబంధిత పత్రాలను ఇచ్చారు(Helping). ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. LOCలు అందుకున్నవారి వివరాలు.. 1. మోత్కూరి తనుష్ గౌడ్. నివాసం.. గుమ్మిర్యాల్(ఎర్గట్ల మండలం). ఎల్వోసీ విలువ రూ.2 లక్షలు. 2. మహమ్మద్ ఫాతే అహ్మద్. నివాసం.. బాల్కొండ. ఎల్వోసీ విలువ రూ.లక్ష.
- Advertisement -
