Friday, February 13, 2026
HomeతెలంగాణIAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

  • పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి శృతి ఓజా
  • నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపారి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. ఈ బదిలీల్లో జీహెచ్‌ఎంసీ, జిల్లా కలెక్టర్‌ పదవులు, కీలక శాఖల కమిషనర్‌ పోస్టులు ఉన్నాయి.గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్లుగా ఐఏఎస్‌ అధికారులు జి. శ్రీజన, వినయ్‌ కృష్ణారెడ్డిని రాష్ట్ర సర్కార్‌ నియమించింది. హైదరాబాద్‌ నగర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో వీరి పాత్ర కీలకంగా ఉండనుంది.పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి శృతి ఓజాను నియమించింది. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థల పర్యవేక్షణ, గ్రామస్థాయి పరిపాలన బలోపేతం దిశగా ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామీణ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.జిల్లా స్థాయిలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి ఇలా త్రిపాఠిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

ఆమెను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. నిజామాబాద్‌ జిల్లాలో పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడం ఆమె ప్రధాన బాధ్యతగా ఉండనుంది.నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌ను నియమించింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. నల్గొండ జిల్లాలో సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక నారాయణపేట జిల్లాలో అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్‌ ప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

జిల్లా పరిపాలనలో అదనపు కలెక్టర్‌ పాత్ర కీలకమైన నేపథ్యంలో, అభివృద్ధి పనులు, రెవెన్యూ వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ బదిలీలు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం, పరిపాలనలో వేగం పెంచడం, బాధ్యతాయుత పాలనను బలోపేతం చేయడమే ఈ మార్పుల లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.తాజా ఐఏఎస్‌ బదిలీలతో తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ప్రయోజనమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News