- మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం, జమాల్ పురం జంట గ్రామాలకు ఇటీవల నూతనంగా సర్పంచులుగా గెలిచి, పదవి బాధ్యతలు స్వీకరించిన ఏర్పుల శ్రీనివాస్, జున్ను కనకయ్య లను మండల కేంద్రంలో పలువురు టిఆర్ఎస్ నాయకులతో కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించిన మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు. ఈ సందర్భంగా మేడిశెట్టి రాములు మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఈ ఐదు సంవత్సరాల పదవి కాలంలో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోనె సంపత్, గంగాధర్ రావు, సురేందర్ రావు, సింగారం రమేష్, మహ్మద్ సర్వర్, కంటెమ్ ఏకాంతం, కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
