పుట్టపర్తి(Puttaparthi)లో జరిగిన శ్రీసత్యసాయిబాబా (Srisatyasaibaba) జయంతి ఉత్సవాల్లో (Jayanthi Celebrations) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడాన్ని మహాద్భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. మానన సేవే మాధవ సేవ అని సత్యసాయిబాబా భావించేవారని తెలిపారు. సమాజానికి (Society) సేవలందించిన (Services) మహానుభావుల్లో సత్యసాయిబాబా అగ్రభాగాన ఉన్నారని పేర్కొన్నారు. చాలా మంది సత్యసాయిబాబా భక్తులు దేశ, విదేశాల్లోని పేదవారికి సేవలందిస్తున్నారని వెల్లడించారు.

రాష్ట్రపతి ఇంకా ఏమన్నారంటే..
- సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయిబాబా నిరంతరం బోధించేవారు.
- సత్యసాయిబాబా లోక కళ్యాణం కోసం పని చేసేవారు.
- సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పనిచేస్తోంది.
- 1969లో మహిళల కోసం అనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు.
- నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయిబాబా సేవలందించారు. దీన్ని అందరూ పాటించాలి.
- 100వ జయంత్యుత్సవాల సందర్భంగా సత్యసాయిబాబా స్ఫూర్తితో పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి.
- Advertisement -
