జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే(JubileeHills Mla)గా గెలిచిన నవీన్ యాదవ్.. AIMIM పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపఎన్నికలో AIMIM పార్టీ నవీన్ యాదవ్కి పూర్తి స్థాయి మద్దతు (Support) ప్రకటించినందుకు కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్.. ఎన్నికల విజయంలో AIMIM పార్టీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేసుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి పుష్పగుచ్ఛం అందించి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలకు, మైనార్టీల సంక్షేమానికి (Minorities Welfare) పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా నవీన్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -
