విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవం(Minority Welfare Day)లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ మైనారిటీ శ్రేయోభిలాషినేనని చెప్పారు. భారతరత్న (Bharataratna) మౌలానా అబుల్ కలాం ఆజాద్ (Maulana Abul Kalam Azad) జయంతి (Jayanthi) సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. తాను ముస్లిం (Muslim) మైనార్టీలను అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని తెలిపారు. మైనారిటీలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
- Advertisement -
