నర్సంపేట(Narsampet) పట్టణంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో గల ఓ క్లాత్ స్టోర్ షాపు లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్(Short Circuit) తో మంటలు చెలరేగి షాపు మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద సంఘటనలో షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు దగ్ధం కావడంతో 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించినట్లు షాప్ యజమాని బొప్పరాతి రాజు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


- Advertisement -
