Wednesday, March 18, 2026
Homeరాజకీయంకేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

నాడు వాసాలమర్రిలో కేసీఆర్ ఇండ్లు కూల్చి గ్రామాన్ని ఆగం చేస్తే..
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుంది.
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లో ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, భువనగిరి ఎం.పి Chamala Kiran Reddy గారు, భువనగిరి ఎమ్మెల్యే Anil Kumar Reddy Kumbam గారు, జిల్లా కలెక్టర్ తో కలిసి 205 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.


🔸కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు
🔸ఆగవ్వ అనే మహిళకు ఇల్లు కట్టిస్తాని ఆశ చూపి చేసిన పచ్చి మోసం బట్టబయలైంది, ఆగవ్వ మాటలు వింటుంటే చాలా బాదేసింది.
🔸 తక్షణమే ఇంటి పనులు మొదలు పెట్టమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఆగవ్వకు చేసిన ఆర్థిక సహాయానికి అభినందనలు
🔸ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చిన్న గ్రామానికి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేకపోయారు

- Advertisement -


🔸వాసాలమర్రి లాగానే రాష్ట్రమంతా ఇండ్లు ఇస్తామంటూ బొమ్మను చూపి ఓట్లు వేయించుకున్నారు
🔸ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి అప్పుల ఊబిలోకి నెట్టారు
💠ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాసాలమర్రిని అన్ని విధాలుగా ఆదుకుంటుంది
💠భవిష్యత్తులో కూడా ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి ఇంటి గుమ్మానికి చేరుస్తుంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News